About Book
" నారీ హృదయం" అనేది ఒక విలక్షణమైన హృదయావిష్కరణ. తల్లి గర్భమందు పిండం గా ఉన్న సమయం మొదలుకొని జీవితపు చరమాంకం వరకు వివిధ సందర్భాలలో స్త్రీ హృదయం లో ఏర్పడిన వివిధ భావోద్వేగాలకు దర్పణం. ఇంత వరకు రాని ఇతివృత్తం. ఇది ఆటోబయోగ్రఫీ కాదు. "తల్లి గర్భం లో పిండ రూపంలో ఉన్నప్పుడే శిశువు కు ఆలోచన ఉంటుంది" అనే శాస్త్ర విషయం ఈ పుస్తకానికి ప్రాతిపదిక. అప్పుడు మొదలైన ఆలోచనా స్రవంతి, జీవితంలో ఆయా సందర్భాలలో కలిగే ఆలోచనలు, అనురాగాలు, భావోద్వేగాలు ఎలా ఉంటాయో, వాటికి ఆడపిల్ల అయితే ఎలా స్పందిస్తుందో " అనే దాన్ని సాధ్యమైనంత వరకు చిత్రించడం జరిగింది.
About Author
రచయిత్రి పరిచయం:-
శ్రీ మతి ఆకెళ్ళ బాలభాను ( ప్రథమ మహిళా శతావధాని) (ప్రథమ మహిళా ద్విశతావధాని )
బిరుదులు:- శతావధాన శ్యమంతకమణి, అవధాన భారతి వనితా తిలకా ,అవధాన శారద, అవధాని సరస్వతి, శతావధాన శిరోమణి, అవధాన మయూరి, వధాన వాగ్వైభవి
జన్మస్థలం:- పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, తోగుమ్మి గ్రామం.
తల్లిదండ్రులు:- శ్రీ బి. విశ్వనాథ శర్మ, శ్రీ మతి సావిత్రి లక్ష్మీ దేవి
భర్త:- డా. ఆకెళ్ళ విశ్వనాథ శర్మ M. A. Phd( Ncc officer S. K. B. R. College అమలాపురం)
పిల్లలు :- సుమేధ, సాత్విక్
విద్యార్హత లు :- తెలుగు ఎమ్. ఎ, ఆచార్య ( సంస్కృతం) ఎమ్. ఎ
నివాసం :- భట్నవిల్లి గ్రామం, అమలాపురం మండలం. తూర్పు గోదావరి జిల్లా.
ఉద్యోగం :- సంస్కృతం లెక్చరర్, ఆదిత్య జూనియర్ కాలేజి, అమలాపురం.
అవధానాలు :- 215అష్టావధానాలు శతావధానాలు - 3 ద్వి శతావధానం -1
వేదిక లు :- ఉత్తర అమెరికా దేశంలో NATS, NATA,లలో అష్టావధానాలు,TANA లో మేడసాని మోహన్ గారి అష్టావధానానికి సంచాలకత్వం, రవీంద్ర భారతి - హైదరాబాద్, కళా భారతి- విశాఖపట్నం, బెంగళూరు, విజయవాడ, అమలాపురం, కొవ్వూరు, తిరుపతి, రాజమహేంద్రవరం, తణుకు, తాడేపల్లి గూడెం, ఏలూరు, కడప, కర్నూలు మొదలైనవి
విజయాలు :-:ప్రథమ మహిళా శతావధాని గా" wonder book of world records " లో స్థానం, అమెరికా లో అవధానం చేసిన మొదటి మహిళ గా " తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ " లో స్థానం
రచనలు- ( ముద్రిత ములు) శతపత్ర సౌరభం ( శతావధాన పద్యాలు) 2. ద్విశత పద్య పరిమళము, (ద్విశతావధాన పద్యాలు ) 3.షష్ఠ్యవధాన సుమాంజలి(60 అవధానాలలో పూరణలు). అముద్రితములు-వెంకటేశ్వర శతకము భారతీ శతకం, సుందరకాండ( తెలుగులో)
phone no - 7981026316, 9491174258